UAE: రంజాన్ కు UAE అధ్యక్షుడి క్షమాభిక్ష..500 మంది భారతీయ ఖైదీల విడుదల..! 4 d ago

పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ అక్కడి జైళ్లలోని ఖైదీలకు క్షమాభిక్ష ప్రసాదించారు. ఈ నేపథ్యంలో అక్కడే ఉంటున్న 1,295 మంది ఖైదీలను రిలీజ్ చేయడంతో పాటు 1,518 మందికి క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించారు. జైళ్ల నుంచి విడుదలైన వారిలో 500 మందికి పైగా భారతీయులు ఉన్నట్లు సమాచారం.